MLA : చిల్లర రాజకీయాల కోసం రాలే..అభివృద్ధి కోసం వచ్చాం…

by Kalyani |
MLA : చిల్లర రాజకీయాల కోసం రాలే..అభివృద్ధి కోసం వచ్చాం…
X

దిశ, తొర్రూరు:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేసి పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిందని, తాజాగా గ్రామాల అభివృద్ధికి సీఆర్ఆర్ నుంచి రూ. 22 కోట్లు, తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం టీఎఫ్ సీడీ నుండి రూ.5 కోట్ల నిధులు మంజూరైన‌ట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన హనుమాన్ల తిరుపతిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.... నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలకుర్తి ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి కి పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్సి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. అదేవిధంగా.. నాపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ పదవిని రైతులకు అన్ని విధాలుగా... అన్ని సౌకర్యాలు అందే విధంగా పని చేస్తానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed