రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

by Sridhar Babu |
రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
X

దిశ, వర్ధన్నపేట : రైస్ మిల్లు పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 12 లక్షల 48 వేల విలువ గల 490 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఈమేరకు తెలిపారు. పీడీఎస్ బియ్యంతో ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేశ్వరి రైస్ మిల్లులో నిల్వ ఉంచేందుకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి వాహనాలలో తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.

దీంతో వాహనం డ్రైవర్ బాలు పారిపోయాడు. మహేశ్వరి రైస్ మిల్లు ఓనర్ కొత్త రాజును అదుపులోకి తీసుకుని మిల్లును సోదా చెయగా భారీ మొత్తంలో బియ్యం పట్టుబడ్డాయి. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్​స్పెక్టర్ ఎస్‌.రవికుమార్‌, ఎస్ఐ శరత్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, వర్ధన్నపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed