పిచ్చికుక్క దాడిలో ఏడుగురికి గాయాలు

by Nagam Mallesh |
పిచ్చికుక్క దాడిలో ఏడుగురికి గాయాలు
X

దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో ఒక పిచ్చి కుక్క దాడిలో ఏడుగురు గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని నుగూరు గ్రామపంచాయతీ పరిధిలో ఒక పిచ్చి కుక్క దారి వెంట నిలుచుని.. ఒకరి తరువాత ఒకరిని ఇలా ఏడుగురిపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు 108 లో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉంది.

Next Story

Most Viewed