మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ : రామచంద్రు నాయక్

by Disha Web Desk 23 |
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ : రామచంద్రు నాయక్
X

దిశ, గూడూరు: మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రంజాన్ పండుగ అని ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రు నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని మసీదు లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని రంజాన్ మాసంలో ఆచరించే ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని, ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అల్లాను కోరినట్లు తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదంతో దేశ ప్రజలందరినీ ఏకం చేస్తూ ఔన్నత్యాన్ని చాటుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకన్న, మైనార్టీ సెల్ అధ్యక్షులు రసూల్ , మధు , శ్రీపాల్ రెడ్డి, సలీం పాషా మరియు ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు,శ్రేణులు ఉన్నారు.


Next Story