కడియం కావ్య గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే

by Disha Web Desk 11 |
కడియం కావ్య  గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే
X

దిశ, వర్థన్నపేట: కడియం కావ్య గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని కొండపర్తి గ్రామంలోని బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్జెల సుమన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాత కొత్త అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి మన అభ్యర్థి కడియం కావ్యని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, కంటెస్టెడ్ జడ్పిటిసి పోలేపల్లి బుచ్చిరెడ్డి, ఏకలవ్య చైర్మన్ రాయపురం సాంబయ్య, రుద్వేగ్ రెడ్డితో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed