రైతులకు అండగా ఉంటా.. పొలంబాటలో ఎమ్మేల్యే కనకయ్య

by Nagam Mallesh |

దిశ, బయ్యారంః రైతులకు అన్ని రకాలుగా తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. నాణ్యమైన విద్యుత్, ప్రమాదాలు జరుగకుండా విద్యుత్ శాఖ అధికారులు సేవలు అందించాలని ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య తెలిపారు. మండలంలోని నర్సాతండా గ్రామంలో విద్యుత్ శాఖ డిఈ పెరుమాళ్ల విజయ్ ఆద్వర్యంలో విద్యుత్ శాఖ - పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మండలంలో రైతులకు విద్యుత్ సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ స్థంబాలు, లూప్ లైన్ లేకుండా, విద్యుత్ ట్రాన్స్ ఫర్ ల కొరత లేకుండా నాణ్యమైన సేవలందించి రైతులు విద్యుత్ ప్రమాదాలు గురి కాకుండా పనులు సత్వరమే పూర్తి చేయాలని సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు, రమేష్, ఏడిఇ కొరవి ఉన్నారు.

Next Story

Most Viewed