కోట చెరువులో గణేష్ నిమజ్జనం చేయొద్దు

by Sridhar Babu |
కోట చెరువులో గణేష్ నిమజ్జనం చేయొద్దు
X

దిశ, వరంగల్ : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు కోట చెరువులో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. ఇక్కడ కేటాయించిన విగ్రహాలను దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేయాలని, అక్కడ అదనంగా నాలుగు క్రేన్లను ఏర్పాటు చేసినట్టు ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. ఇక్కడ లైటింగ్స్ ఏర్పాటు చేసి రోడ్డు రిపేరు చేసినట్టు పేర్కొన్నారు. అన్ని విగ్రహాలు చిన్న వడ్డేపల్లిలో, దేశాయిపేట లో నిమజ్జనం చేయాలని కోరారు. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తూ కోట చెరువులో నిమజ్జనం చేసేందుకు రావద్దన్నారు.

Advertisement

Next Story

Most Viewed