చెక్ డ్యాం నీటిలో పడి విద్యార్థి గల్లంతు..?

by Vinod kumar |
చెక్ డ్యాం నీటిలో పడి విద్యార్థి గల్లంతు..?
X

దిశ, బయ్యారం: శ్రీ చైతన్య విద్యార్థి ప్రమాదవశాత్తు చెక్ డ్యాం నీటిలో పడి గల్లంతైన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బయ్యారం కేంద్రంలోని ముస్తఫా నగర్ కాలనీకి చెందిన షేక్ ఉమర్ యాసిన్ (14) శుక్రవారం ఈతకు వెళ్లి మడుగులో పడి గల్లంతు అయినట్లు తెలిసింది. దీంతో బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమాదేవి గజ ఈతగాళ్లతో అనుమానం ఉన్న నీటి మడుగులలో గాలింపు చేపట్టారు.


అయితే గాలింపులో విద్యార్థి ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో మరోసారి శనివారం చెక్ డ్యామ్ లో గాలింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉమర్ తల్లిదండ్రులు వెతకగా చెక్ డ్యాం వద్ద పిల్లవాని దుస్తులు చెప్పులు, సైకిల్ డ్యాం పక్కనే కనుగొన్నట్లు తెలిపారు.

స్థానికులు , బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పోడు భూముల పట్టాల పంపిణీ సందర్భంగా ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ రాకతో శుక్రవారం విద్యార్థులకు ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాల బస్సులను మీటింగ్‌కు ప్రజలను తరలించడానికి జిల్లా అధికారులు ఉపయోగించడంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story