ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థుల మృతి

by M.Rajitha |
ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కొండపాక మండలం సిరిసినగండ్లలో ఈతకు వెళ్ళిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన హేమంత్, నిశాంత్ లు సిరిసినగండ్లలోని తమ బంధువుల ఇంట్లో గృహాప్రవేశానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. గృహాప్రవేశ కార్యక్రమం అనంతరం సరదాగా చెరువు ఒడ్డుకు వెళ్ళి, దానిలో ఈతకు దిగారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు పూర్తిగా నిండి లోతు తెలియక పోవడంతో ఇద్దరూ అందులో మునిగిపోయారు. బయటకు వెళ్ళిన వారు ఎంతకీ తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల అంతా వెతకగా.. చెరువు ఒడ్డు వద్ద బాలుర దుస్తులు లభించాయి. అనుమానం వచ్చి చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. శుభకార్యం జరుగుతున్న ఇంట్లో అందరూ సంతోషంగా ఉండగా.. ఈ విషాదం తీవ్ర దుఖాన్ని మిగిల్చింది. బంధువుల రోదనలు మిన్నంటగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed