- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కోడి గుడ్డుపై ఈకలు పీకడానికి వెళ్లారా.. హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

దిశ, వెబ్డెస్క్ : హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేశారు.. కానీ కనీస ఇంకితం లేకుండా మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను వేసుకోని ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లి ఆందోళన చేయడం సిగ్గు చేటని టీడీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ప్రతిది రాజకీయం చేస్తూ శవాలపై పేలాలు ఏరుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇరుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు రిస్క్యూ టీమ్స్ 24 గంటలు కష్టపడుతుంటే హరీష్ రావు బృందం అక్కడకు వెళ్లి హడావిడి చేసి, ఫొటోలకు పోజులు ఇస్తూ వారి పనికి ఆటంకం కలిగించకూడదన్న ఇంకితం కూడా లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నిర్మాణ దశలో ఏ ఒక్క మీడియా సంస్థనైనా అక్కడకి అనుమతి ఇచ్చారా? కిలో మీటర్ల దూరంలో ఆపేసిన చరిత్ర మీది, దీనిపై చర్చకు సిద్ధమా అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరారు.
దేశంలోని అన్ని రంగాల రెస్క్యూ టీమ్స్తో యుద్ధ ప్రాతిపదికన పని చేయిస్తుంటే ఏమి చేయాలో అర్ధం కాక చేష్టలు ఉడికి కోడు గుడ్డు పై ఈకలు పీకే పని హరీష్ రావు పెట్టుకున్నాడని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే సమన్వయం లేదని మాట్లాడుతున్నారని, మీరు ఏ సమన్వయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంత సమన్వయంతో నిర్మించిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయిందో హరీష్ రావు చెప్పగలడా ? దానిపై చర్చకు సిద్ధమా? అంటూ నిలదీశారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంలో ప్రాణాలు పోలేదా?, బాహుబలి మోటార్లు వరద నీటిలో ఎందుకు మునిగాయో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఏది పడితే అది మాట్లాడటం హరీష్ రావుకు అలవాటు అయిందని మండిపడ్డారు. టన్నెల్ వెళ్లి హడావిడి చేసి పత్రికలకు ఫోజు ఇవ్వడం కాదని హితవు పలికారు.