25 మంది బీఆర్ఎస్ MLAల చేరిక డేట్ ఇదే.. బాంబు పేల్చిన మంత్రి కోమటిరెడ్డి

by Disha Web Desk 4 |
25 మంది బీఆర్ఎస్ MLAల చేరిక డేట్ ఇదే.. బాంబు పేల్చిన మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల వేళ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీట్ ది ప్రెస్ లో కోమటిరెడ్డి మాట్లాడారు. వచ్చే పదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అన్నారు. త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్‌లో చేరాతన్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదించారని బాంబు పేల్చారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 అసెంబ్లీ సీట్లు అవుతాయన్నారు. డీలిమిటేషన్ తర్వాత 154 సీట్లలో కాంగ్రెస్ 125 సీట్లు గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు.

Read More...

బతుకమ్మ పండుగను అవమానించిన మంత్రి కోమటిరెడ్డి..!

Next Story

Most Viewed