- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Assembly: ఆ ప్రాతిపదికన డీలిమిటేషన్కు అంగీకరించం.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

దిశ, వెబ్డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. పునర్విభజనతో జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని అన్నారు. ప్రస్తుత జనాభాను ప్రాతిపదికగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ సీట్లను కూడా పెంచాల్సిన అవశ్యకత ఉందన్నారు.
వాజ్పేయ్ కూడా వ్యతిరేకించారు..
1971లో రాజ్యాంగ సవరణతో డీలిమిటేసన్ ప్రక్రియను 25 ఏళ్లుగా నిలిపేశారని సభ దృష్టి తీసుకొచ్చారు. ప్రస్తుతం పునర్విభజనపై నేటికి అదే గందరగోళం నెలకొందని కామెంట్ చేశారు. ఇటీల తమిళనాడులో సీఎం స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేశారని.. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానం చేశామని గుర్తు చేశారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను వాజ్పేయ్ కూడా వ్యతిరేకించారని పేర్కొన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండానే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతోందని మండిపడ్డారు. పునర్విభజనపై సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారని.. కానీ జనాభా నియంత్రణపై కేంద్రం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్రాలు జనాభాను నియంత్రించ లేదని ఆరోపించారు.
అన్ని పార్టీలు ఒకే మాటపై ఉండాలి..
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనం కోసం జమ్ముకశ్మీర్, అసోంలో అసెంబ్లీ నియోజవర్గాలను పెంచారని ఆరోపించారు. కానీ, ఏపీ పునర్విభజన చట్టంలో అసెంబ్లీ సీట్లను పెంచాలని.. స్పష్టం పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవట్లేదని ధ్వజమెత్తారు. సౌత్ స్టేట్స్కు ప్రస్తుతం లోక్సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉందని.. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 19 శాతానికి పడిపోతుందని కామెంట్ చేశారు. అందుకే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఓకే మాటపై ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెట్టే తీర్మానానికి పార్టీలకు అతీతంగా తమ మద్దతును ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.