- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న టీమిండియా ప్లేయర్లు
దిశ, వెబ్డెస్క్: దసరా(Dussehra) పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్(Jubilee Hills) పెద్దమ్మ తల్లిని టీమిండియా(Team India) ప్లేయర్లు తిలక్ వర్మ(Tilak Verma), నితిష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) దర్శించుకున్నారు. బంగ్లాదేశ్తో టీ20 మ్యాచ్ నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన భారత ప్లేయర్లు శనివారం పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు టీమిండియా మరియు బంగ్లాదేశ్ మధ్య మూడో మరియు చివరి టీ20 మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సిరీస్ ఇప్పటికే భారత్ 2-0 తో గెలిచినప్పటికీ, ఈ చివరి మ్యాచ్కు కూడా ప్రాధాన్యత ఉండటంతో ఇరు జట్లు మరింత జాగ్రత్తగా బరిలోకి దిగనున్నాయి. సిరీస్ గెలిచిన భారత్, చివరి మ్యాచ్లో కూడా విజయాన్ని సాధించి సిరీస్ను 3-0తో ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, ఇప్పటికే రెండు మ్యాచ్లను కోల్పోయిన బంగ్లాదేశ్ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాచ్లో కఠినంగా పోరాడాలని చూస్తోంది. జట్టులోని కీలక ఆటగాళ్లు తమ శక్తిసామర్థ్యాలను చూపించి, విజయం సాధించాలని కసరత్తు చేస్తున్నారు.