రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే పత్తి రైతుకు దక్కని మద్దతు ధర : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే పత్తి రైతుకు దక్కని మద్దతు ధర : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ వైఫల్యంతోనే పత్తి రైతులకు మద్దతు ధర అందడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బడా భాయ్ ప్రధాని మోడీ రాష్ట్రంలో పత్తి రైతుకు పట్టాభిషేకం.. ఛోటా భాయ్ రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం పత్తి రైతు చిత్తు అని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గుజరాత్ లో మద్దతు ధరకు మించి పత్తి క్వింటాల్ కు రూ.8,257 రేటు లభిస్తుండగా, మరి తెలంగాణలో పత్తి రైతుకు కేవలం రూ.5 వేలేనా ? అని ప్రశ్నించారు. మార్కెట్ కు దిగుబడి వచ్చినా సీసీఐ కేంద్రాలెక్కడ ? అని, ఇందిరమ్మ రాజ్యమని దళారుల రాజ్యం తెస్తారా ? అని ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు.

రెండేళ్ల క్రితం పత్తికి 10 నుంచి 15 వేల ధర పలికిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏమిటీ అనర్థం ? అని విమర్శించారు. నిన్న పెట్టుబడి సాయం అందించలేదని, నేడు కష్టించి పండించినా కొనుగోళ్లు చేయరా..? అని నిలదీశారు. పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటమాడుతుందని, ముందుచూపు లేని ముఖ్యమంత్రి వల్లే ఈ అన్యాయమని ఆరోపించారు.

Next Story

Most Viewed