పోలీసుల అదుపులో శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by M.Rajitha |   ( Updated:2024-10-19 10:51:37.0  )
పోలీసుల అదుపులో శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జీవో 29 రద్దు చేసి, గ్రూప్ 1 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అభ్యర్థులు గత కొద్ది రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా జీవో రద్దు, పరీక్షల తేదీల మార్పు చేయించాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో నేడు గ్రూప్ 1 అభ్యర్థులు సెక్రెటేరియట్ ముట్టడికి పిలుపు నిచ్చారు. అందులో భాగంగా వేలాది మంది అభ్యర్థులు ర్యాలీగా అశోక్ నగర్ నుండి సెక్రెటేరియట్ వైపు వెళ్ళగా.. వారికి బీజేపీ నేత బండి సంజయ్, బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు మద్దతుగా వచ్చారు. దీంతో సెక్రెటేరియట్ పరిసర ప్రాంతాల్లో గ్రూప్ 1 అభ్యర్థులు, ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లి పోయింది. కొంతమంది అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగగా.. పోలీసులు బండిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక బీఆర్ఎస్ నేతలు, మరికొంతమంది అభ్యర్థులు సెక్రెటేరియట్ వైపు వెళ్తుండగా.. శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా వందల మంది గ్రూప్ 1 అభ్యర్థులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా అశోక్ నగర్ నుండి సెక్రెటేరియట్ పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల పహారాలో కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed