కరీంనగర్‌లో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రులకు వినతి

by Shiva |
కరీంనగర్‌లో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రులకు వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయను కార్మిక నేతలు కోరారు. న్యూఢిల్లీలో సోమవారం మన్సూక్ మాండవీయను కలిసిన బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్‌గా మారిందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్‌కు వస్తున్నారని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులు, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం వల్ల తమ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు. బండి సంజయ్ విజ్ఞప్తికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. అతి త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed