ట్రైనీ ఐఏఎస్‌లకు సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేష‌న్..

by Rajesh |
ట్రైనీ ఐఏఎస్‌లకు సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేష‌న్..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేడర్‌కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు శుక్రవారం బస్‌భవన్‌ను సందర్శించారు. టీజీఎస్ ఆర్టీసీ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వారు అధ్యయనం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మీ పథకం అమలు, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ట్రైనీ ఐఏఎస్‌లు ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రొగ్రాం శిక్షణ తీసుకుంటున్నారు. బస్ భవన్ ను సందర్శించిన వారిలో ట్రైనీ ఐఏఎస్ లు ఉమా హారతి, గరిమా నరులా, మనోజ్, మృణాల్, శంకేత్, అబిజ్ఞాన్, అజయ్‌లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed