Rashtrapathi Nilayam: రాష్ట్రపతి నిలయంలో.. 28 నుంచి కళా మహోత్సవాలు

by Geesa Chandu |
Rashtrapathi Nilayam: రాష్ట్రపతి నిలయంలో.. 28 నుంచి కళా మహోత్సవాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 28 నుంచి.. సికింద్రాబాద్ బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల కళా మహోత్సవాలు జరగనున్నాయి.ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు కొనసాగే ఈ ఉత్సవాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని రాష్ట్రపతి నిలయ కార్య నిర్వహణ అధికారి రజనీ ప్రియ వెల్లడించారు.

ఈశాన్య రాష్ట్రాల యొక్క జీవన విధానం(Way of Life), సంస్కృతి(Culture), సంప్రదాయాలు(Traditions) గురించి తెలియజేయడానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారి తెలిపారు. అయితే ఈ ఉత్సవాల్లో భాగంగా 28 న ఉదయం నుంచే పలు రకాల స్టాల్స్(Stalls) అందుబాటులో ఉంటాయని, సాయంత్రం కళా ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఈ ఉత్సవాలను సందర్శించాలనుకున్నారు రాష్ట్రపతి నిలయం ఎంట్రీ గేటు వద్ద కౌంటర్ లో వివరాలు నమోదు చేసుకోవాలని లేదా https://rashtrapatibhavan.gov.in వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలి" అని ఆమె తెలిపారు.

Next Story

Most Viewed