విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించండి : తోకల శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 11 |
విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించండి : తోకల శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, రాజేంద్రనగర్ : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరారు. శనివారం రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు బాబు రావు ఆధ్వర్యంలో శివరాంపల్లి లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వేశ్వర్ రెడ్డి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. మరోసారి మోడీ ప్రధాని అయితేనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. యువత బిజెపికి ఓటు వేయాలని కోరారు. విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని తోకల శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొక్క బాలు రెడ్డి, సత్యనారాయణ్ ముదిరాజ్, రాహుల్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed