- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ తోనే పేదల సంక్షేమం : రంజిత్ రెడ్డి
దిశ,మహేశ్వరం : కాంగ్రెస్ పార్టీ తోనే పేదల సంక్షేమం,అభివృద్ధి జరుగుతుందని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శనివారం కందుకూరు మండలం సరస్వతి గూడ, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గూడూరు, పులిమామిడి ,నేదునూరు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ...కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే పేదల సంక్షేమం, అభివృద్ధి, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య అందుబాటులో ఉండే వ్యక్తిని మరోసారి ఆశీర్వదించాలని రంజిత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరినాధ్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ కేఎల్ఆర్, కందుకూరు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, నాయకులు కృష్ణా నాయక్, ఏనుగు జంగారెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.