Worst road : ఇదేం రోడ్డు... వర్షాలకు అధ్వానంగా మారిన వైనం

by Sridhar Babu |
Worst road : ఇదేం రోడ్డు... వర్షాలకు అధ్వానంగా మారిన వైనం
X

దిశ, యాచారం : ఎడతెరపి లేకుండా నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు అంతర్గత రోడ్లు గుంతల మయంగా మారాయి. నడిచేందుకు వీలు లేకుండా బుర దమయంగా తయారు కావడంతో దాంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులను పడుతున్నారు. మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలోని రోడ్లు వర్షాలకు చిత్తడిగా తయారై గుంతలమయంగా మారాయి. గుంతలలో వర్షం నీరు చేరి చిత్తడిగా తయారై వాహనాలకు,

పాదచారులకు కనీసం నడిచేందుకు కూడా వీలులేకుండా ఉంది. గుంతలలో చేరిన నీటిలో దోమలు, ఈగలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని, జ్వరాలు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో సాయినగర్ కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షానికి పాడైపోయిన రోడ్ల పైన మొరం మట్టి పోయించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.



Next Story