కాంగ్రెస్‌కు భారీ మెజార్జీ ఖాయం: జైపాల్‌రెడ్డి

by Disha News Web Desk |
కాంగ్రెస్‌కు భారీ మెజార్జీ ఖాయం: జైపాల్‌రెడ్డి
X

దిశ, గండిపేట్: కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని స‌భ్యత్వం ఉంద‌ని రాజేంద్రనగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, కొడంగల్ నియోజకవర్గం డిజిటల్ మెంబర్షిప్ సమన్వయకర్త ముంగి జైపాల్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో ముంగి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముంగి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి పున‌రుజ్జీవం పోసుకోవ‌డం ఖాయ‌మ‌న్నారు. రేవంత్‌రెడ్డి సార‌ధ్యంలో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలుపొంద‌డం ఖాయ‌మ‌న్నారు.

Advertisement

Next Story

Most Viewed