రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

by Disha Web Desk 11 |
రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
X

దిశ, యాలాల : చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా శనివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి మండలంలోని కోకట్ పగిడాల్, దేవనూర్, యాలాల మండల కేంద్రం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో న్యాయం చేసే ఏకైక ప్రభుత్వమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో అధికారంలోకి రావడానికి పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజలు రంజిత్ రెడ్డి ని గెలిపించాలని మద్దతు తెలుపుతున్నారని, ఈ ప్రభంజనం చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో రంజిత్ రెడ్డి మరోసారి ఎంపీగా గెలవబోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకం పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, తెలంగాణ ఓబీసీ కన్వీనర్ సునీత సంపత్, ఎసిఏస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కో ఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, కర్ణం పురుషోత్తమరావు, సిద్రల శ్రీనివాస్ హనుమంతు ముదిరాజ్, భీమయ్య, బస్వరాజు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Next Story

Most Viewed