Raging : మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

by Sridhar Babu |
Raging : మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
X

దిశ, రాజేంద్రనగర్ : మైలార్దేవుపల్లి డివిజన్లో ఉన్న మహవీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను ర్యాగింగ్ పేరుతో సీనియర్లు ఐదుగురు దాడి చేసినట్లు ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 23వ తేదీన జూనియర్ విద్యార్థులను బాత్రూంలో సీనియర్లు ర్యాగింగ్ చేసి దాడి చేసినట్లు రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సెమినార్ ఉందని విద్యార్థులు సీనియర్లను పిలిచారు.

దీంతో ఒక్కసారిగా సీనియర్లు రెచ్చిపోయారు. జూనియర్ విద్యార్థులను బాత్రూంలోకి తీసుకెళ్లి వారిని బంధించి పిడుగుద్దులు కురిపించారు. దీంతో బాధిత విద్యార్థులకు గాయాలయ్యాయి. వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు ఐదుగురు సీనియర్ విద్యార్థులను అరెస్టు చేశారు. బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు కాలేజీ యాజమాన్యానికి సూచించినట్లు ఏసీపీ వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story