బీజేపీ, కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు : పైలెట్ రోహిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
బీజేపీ, కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు :  పైలెట్ రోహిత్ రెడ్డి
X

దిశ ,పెద్దేముల్ : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూరు, జయరాం తండా గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ కాసాని జ్ఞానేశ్వర్ మద్దతుగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలకు వచ్చానన్నారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.

నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. బిజెపి మతల మధ్య విద్వేషాలు రగిలిస్తోందని, కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే, రాజ్యాంగాన్ని రద్దుచేసి, బీసీ, ఎస్సీ ,ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు తొలగిస్తుందని ఆరోపించారు. పదేళ్లలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసిఆర్ కి దక్కిందని కొనియాడారు. చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరుని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, ఎంపీటీసీ ప్రవీణ్ పటేల్, దన్ సింగ్, సొసైటీ వైస్ చైర్మన్ అంజయ్య,మాజీ సర్పంచులు జనార్దన్ రెడ్డి, భరత్, రమేష్ యాదవ్, జయరాం, మొగులప్ప, ప్రశాంత్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed