ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ : డీకే అరుణ

by Disha Web Desk 23 |
ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ : డీకే అరుణ
X

దిశ, షాద్ నగర్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల పథకాలతో ప్రజలను మోసం చేసి మహిళలను ముఖ్యంగా మోసం చేశారని అన్నారు.గద్దెనెక్కాక ప్రజలను, ఇచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రికి ఓటు ద్వారా సమాధానం చెప్పాలని అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, ప్రముఖ మాజీ సినీ నటి నవనీత్ కౌర్ డిమాండ్ చేశారు.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేంద్రంలో మహబూబ్ నగర్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థిని డీకే అరుణ తో కలిసి బుధవారం సాయంత్రం భారీ రోడ్ షో చేపట్టారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్థానిక నాయకులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అందే బాబయ్య తదితర నేతల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో డీకే అరుణ సుడిగాలి పర్యటన చేపట్టారు. పట్టణ కేంద్రంలో ఎంపీ నవనీత్ కౌర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాలో జరిగిన రోడ్డు షో కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ నవనీత్ కౌర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఆడబిడ్డ డీకే అరుణను అవమానించి నోటి దురుసుతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిజెపి అభ్యర్థి డీకే అరుణ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. షాద్ నగర్ రోడ్ షో లో డీకే అరుణ రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలపై ఆమె మండిపడ్డారు.రేవంత్ రెడ్డి ఇంట్లో తనలాంటి మహిళలు లేరా? అని ఆమె ప్రశ్నించారు.

ఇంటికి ఆడబిడ్డ ఒక లక్ష్మీ అని సిరిసంపద అని ఆమె అన్నారు. అలాంటి సాటి ఆడపడుచును పట్టుకొని రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతా, తన అలంకరణ (మేకప్) గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం తాను ఒక అవినీతి పరురాలంటూ చిత్రీకరించడం రేవంత్ రెడ్డికి చెల్లదని అన్నారు. తన నీతి నిజాయితీ నిబద్ధతని అతనితో పోలిస్తే తన కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చెంది మహేందర్ రెడ్డి పాతపల్లి కృష్ణారెడ్డి కక్కునూరు వెంకటేష్ గుప్తా కమ్మరి భూపాల చారి చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి పేట అశోక్ చెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story