జల్ పల్లి చెరువులో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

by Disha Web Desk 11 |
జల్ పల్లి చెరువులో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
X

దిశ, బడంగ్ పేట్ : జల్ పల్లి లో చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమైన ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పహాడి షరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 5 వ తేదీన ఉదయం 9 గంటలకు ఎర్రకుంటకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ వహీద్ (14) తన స్నేహితులైన అబూ బాకర్ బిన్ సాహెద్ నహాది (16), అబ్దుల్ హఫీజ్ (24), సయ్యద్ వసీమ్ (31) లు జల్ పల్లి పెద్ద చెరువులో చేపలు పట్టడానికి అని ఇంట్లో చెప్పి బయలుదేరారు. ఒక రాయి పై కూర్చొని చేపలు పడుతున్న అబూ బాకర్ బిన్ సాహెద్ నహాది ప్రమాదవశాత్తు జారి కిందపడి పోయాడు. అతన్ని కాపాడబోయి చెరువులోకి దూకిన మొహమ్మద్ అబ్దుల్ వహీద్ అతన్ని రక్షించలేక పోయాడు.

విషయాన్ని గమనించిన మిగతా స్నేహితులు మొహమ్మద్ వసీమ్ కూడా చెరువులోకి దూకాడు. అతన్ని చూసి సాహెద్ నహాది కూడా ఈత రాకున్నా చెరువులోకి దూకాడు. చివరగా మొహమ్మద్ వసీమ్ నీట మునుగుతున్న అబూబాకర్ బిన్ సాహెద్ నహాది ని రక్షించాడు. నీట మునిగిన మెహమ్మద్ అబ్దుల్ వాహెద్, ఉస్మాన్ బిన్ సాబేద్ నహాది మృతదేహాల కోసం వెతికినప్పుడు కి ప్రయోజనం లేకుండా పోయింది. గల్లంతైన మెహమ్మద్ అబ్దుల్ వాహెద్, ఉస్మాన్ బిన్ సాబేద్ నహాది మృతదేహలు మరునాడు తేలుతూ కనిపించడంతో పహాడి షరీఫ్ పోలీసులు వెలికితీసి పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును పహాడి షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed