తెగిన విద్యుత్ వైరు షాక్ తగిలి.. వ్యక్తి మృతి

by Aamani |
తెగిన విద్యుత్ వైరు షాక్ తగిలి.. వ్యక్తి మృతి
X

దిశ,బొంరాస్ పేట్ : తెగిపడిన విద్యుత్ వైర్ తగిలి.. వ్యక్తి మృతి చెందిన ఘటన బొంరాస్ పేట్ మండలం లో చోటుచేసుకుంది. ఎస్ఐ రవూఫ్ తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన సంగెం అంజిలయ్య(34) మంగళవారం ఉదయం తన పొలానికి వెళ్లగా, తన పొలానికి ఏర్పాటు చేసిన, విద్యుత్ వైరు తెగి పడింది. అది గమనించకపోవడం తో,అంజి లయ్య నడుచుకుంటూ వెళ్తుండగా,తెగిపడిన విద్యుత్ తీగ కాలికి తగలడంతో,ఎడమ కాలికి గాయమై,అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుని భార్య సంగెం లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవూఫ్ తెలిపారు.

Next Story