కడుపు నొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య

by Disha Web Desk 15 |
కడుపు నొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, తాండూరు : కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాండూర్ మండలం వీరారెడ్డి పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కరణ్ కోట్ ఎస్సై విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగారం వీరేశం (48) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక గుర్తుతెలియని పురుగుల మందు తాగి చనిపోయాడు. అనంతరం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. తన భర్త మరణానికి సంబంధించి ఎవరిపై అనుమానం లేదని మృతుడి భార్య నాగారం నాగమణి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story