రమేష్ రాథోడ్ మరణం బీజేపీకి తీరని లోటు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |
రమేష్ రాథోడ్ మరణం బీజేపీకి తీరని లోటు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ హఠాన్మరణం మరణం పట్ల కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేష్ రాథోడ్ మరణం బీజేపీకి తీరని లోటు అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రమేష్ కీలకంగా పని చేశారని గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలకు ఎమ్మెల్యే, ఎంపీగా ఆయన చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్ సైతం రమేష్ రాథోడ్ మృతికి సంతాపం తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని అన్నారు. కాగా, గుండెపోటుతో ఇవాళ రమేష్ రాథోడ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రమేష్ రాథోడ్ మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story