Raja Singh: ముత్యాలమ్మ గుడిని సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

by Ramesh Goud |
Raja Singh: ముత్యాలమ్మ గుడిని సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే వారం రోజుల గృహ నిర్భంధం తర్వాత ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ఆలయానికి వెళ్లారు. పటిష్ట పోలీస్ బందోబస్త్ నడుమ రాజాసింగ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విగ్రహ ధ్వంసం గూర్చి అడిగి తెలుసుకున్నారు. అంతేగాక విగ్రహ పున: ప్రతిష్టాపన పనులపై ఆలయ నిర్వాహకులను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే రాజాసింగ్ వెనుదిరిగారు.

కాగా ముత్యాలమ్మ టెంపుల్ ఘటన అనంతరం రాజాసింగ్ ఆలయాన్ని సందర్శిస్తానని ప్రకటించారు. దీంతో శాంతి భద్రతల సమస్యగా భావించిన పోలీసులు ఎమ్మెల్యేను హౌజ్ అరెస్ట్ చేశారు. దీనిపై రాజాసింగ్ అందరు ప్రతిప్రతినిధులకు అనుమతి ఇస్తున్నారని, తనను మాత్రం ఓ టెర్రరిస్ట్ లాగా ఎందుకు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. అంతేగాక ఎన్ని రోజులు నిర్భంధించినా తప్పకుండా ముత్యాలమ్మ గుడిని సందర్శిస్తానని చెప్పారు.

Advertisement

Next Story