CM రేవంత్‌తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

by Gantepaka Srikanth |
CM రేవంత్‌తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీ కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక.. తొలిసారి మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. తన నియామకానికి సహకరించిన రేవంత్ రెడ్డికి మహేశ్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు చెప్పనున్నారు. కాగా, రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటి నుంచి పీసీసీ చీఫ్‌గా ఎవరుంటారనే ప్రశ్న అందరినీ వెంటాడింది. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నియామకంతో క్వశ్చన్‌మార్క్‌కు పుల్‌ స్టాప్‌ పడింది. ప్రస్తుతం ఎమ్మెల్సీతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయనకే పట్టం కట్టింది. బీసీ నేతకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై బీసీ నాయకులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story