- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కాంగెస్లో చేరడంపై మరోసారి పోచారం కీలక వ్యాఖ్యలు
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం హస్తం పార్టీలో చేరడంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పోచారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. రాహుల్ గాంధీకి పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగా పోచారం మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జన్మ కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభం అయిందన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరినట్లు తెలిపారు. పదేళ్లు కేసీఆర్ నాయకత్వంలో పనిచేశా అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. రైతులకు మంచి జరగాలనే కాంగ్రెస్ పార్టీలో చేరా అని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సీనియర్ నాయకుడైన పోచారంనకు రేవంత్ సర్కారు కీలక పదవి కట్టబెట్టనుందనే టాక్ నడుస్తోంది.
Next Story