ఒడిశా సీన్ తెలంగాణలో రిపీట్.. ఈటల కీలక వ్యాఖ్యలు

by Rajesh |
ఒడిశా సీన్ తెలంగాణలో రిపీట్.. ఈటల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్ గిరి ఎంపీ స్థానంలో భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టినా.. కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేయడంలో సక్సెస్ అయిందన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అని ప్రచారం చేశారన్నారు. అనేక రకాలైన అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణలో గద్దెనెక్కిందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పాలన చూశారని.. కాంగ్రెస్ పాలన చూశారని.. దీంతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే చర్చ మొదలైందన్నారు. తెలంగాణలో సాధించిన ఎంపీ ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు పునాదిగా ఈటల అభివర్ణించారు. ఒడిశాలో చాలా యేళ్ల తర్వాత బీజేపీ అద్భుతమైన విజయం సాధించిందని అదే తరహాలో తెలంగాణలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న కాలంలో వార్డు మెంబర్ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ విజయం సాధించడంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed