- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మోడీ, అమిత్ షాపై అసభ్యకర పోస్టులు చేసిన వారిని శిక్షించాలి
దిశ, నిజామాబాద్ సిటీ : మోడీ, అమిత్ షాపై అసభ్యకర పోస్టులు చేసిన వారిని శిక్షించాలని అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దేశంలో మోడీ ప్రభంజనాన్ని తట్టుకోలేక కొన్ని అసాంఘిక శక్తులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని తిరుమల్ పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో మోడీ, అమిత్ షా ,
శ్రీరాముని ఫొటోతో కూడిన పోస్టర్ తో అందులోనే సీతాదేవిని ఉంచి పోస్టులు పెట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కు ఎమ్మెల్యేలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులు తల్లిగా పూజించే సీతమ్మ ఫొటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.