arrested : భూ అక్రమ కబ్జా చేసిన వ్యక్తి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

by Kalyani |
arrested : భూ అక్రమ కబ్జా చేసిన వ్యక్తి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ షాహిద్ పాషా అనే వ్యక్తిని గురువారం భూ అక్రమ కబ్జా కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ... డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం గోపాల్ పేట్ గ్రామానికి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ షాహిద్ పాషా మండల కేంద్రంలో ఇతరుల భూమిలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు, భూకబ్జాలు చేసుకుంటూ వాళ్లను భయభ్రాంతులకు గురి చేశాడని, మహమ్మద్ షాహిద్ పాషా పైన నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదు అయ్యాయన్నారు. షాహిద్ పాషా ను భూ అక్రమ కబ్జా కేసులో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్, స్థానిక ఎస్సై రాజు ఉన్నారు.



Next Story