- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
దిశ, ఆర్మూర్ : కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని, ఇక ఆ పార్టీలపై యుద్ధమేనని మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్లోని ఎమ్మార్ గార్డెన్ లో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరై మాజీ మంత్రి జోగు రామన్న, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ చేతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలుబొమ్మగా మారారని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ తెలంగాణ రాష్ట్రంకు
ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం అని అన్నారు. రాబోయే పార్లమెంట్, గ్రామ సర్పంచ్ ఇతర ఏ ఎన్నికలలో నైనా పోటీకి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలలో సైతం బీఆర్ ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, పట్టణ మండల అధ్యక్షులు పూజ నరేందర్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి, మచ్చర్ల సాగర్ ,సత్యనారాయణ, జెడ్పీటీసీలు మెట్టు సంతోష్, ఎర్రం యమునా ముత్యం, ఎంపీపీలు పస్క నరసయ్య, వాకిడి సంతోష్ రెడ్డి, మాస్త ప్రభాకర్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.