- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
దిశ, ఆర్మూర్ : అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని అధికారులు వెంటనే కొనుగోలు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. శనివారం అకాల వర్షానికి రైతులు పండించిన పంట తడిసి మొలకలు వచ్చిన సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలలోని వెల్మల్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు.
తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని అధికారులతో ఫోన్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, వెంటనే యుద్ధ ప్రాతిపదికన వడ్లను తరలించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లోని కల్లాల్లో రైతులకు సంబంధించిన తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, భూమేష్,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.