రాజారెడ్డి మృతి సమాజానికి తీరని లోటు

by Sridhar Babu |
రాజారెడ్డి మృతి సమాజానికి తీరని లోటు
X

దిశ, ఆర్మూర్ : ప్రముఖ సమాజసేవకుడు పైపుల రాజారెడ్డి మరణం సమాజానికి తీరని లోటు అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో గల లాలన ఆశ్రమంలో ఆదివారం నిర్వహించిన పైపుల రాజారెడ్డి అంతక్రియలకు వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై రాజారెడ్డి మృత దేహానికి నివాళి అర్పించారు. అంత్యక్రియల్లో వేముల ప్రశాంత్ రెడ్డి కాసేపు రాజారెడ్డి పాడెమోశారు.

ఈ సందర్భంగా స్వచ్చంద సేవా సంస్థ ద్వారా ఎందరో పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం చేశారని , అలాగే లాలన వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి నీడ లేని ఎందరో వృద్ధులకు బాసటగా నిలిచారంటూ గుర్తు చేరుకున్నారు. అంతక్రియలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి హాజరై నివాళులర్పించారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed