రైలులో నుంచి జారిపడి ఒకరికి తీవ్ర గాయాలు

by Sridhar Babu |
రైలులో నుంచి జారిపడి ఒకరికి తీవ్ర గాయాలు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ శివారులో సోమవారం నడుస్తున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఒకరికి తీవ్ర గాయాలైనట్లు రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. కాగా క్షతగాత్రుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఇతన్ని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. సంబంధికులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు.

Advertisement

Next Story