ట్రాక్టర్ బైక్ ఢీకొని బాలిక మృతి

by Mahesh |
ట్రాక్టర్ బైక్ ఢీకొని బాలిక మృతి
X

దిశ, మద్నూర్/డోంగ్లి: ట్రాక్టర్ బైక్ ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషాద సంఘటన తాడి హిప్పర్గ గ్రామ శివారులో సోమవారం రాత్రి 7 గంటలకు చోటు చేసుకుంది. కాగా వీరు లింబూర్ వాడి గ్రామానికి చెందిన రాజు, చందు వారి తమ్ముడు నాగనాథ్ కూతురు సాన్విక(6) బైక్ పై మద్నూర్ నుండి వారి గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో తాడిహిప్పర్గ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో సాన్విక అక్కడిక్కడే మృతి చెందగా.. రాజు, చందు కి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed