కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు

by Kalyani |
కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి పై అవిశ్వాస తీర్మానం కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఛైర్పర్సన్ నిట్టు జాహ్నవి పై 27 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తమ సంతకాలతో కూడిన నోటీసును కలెక్టర్ కు అందజేశారు. అవిశ్వాస ప్రక్రియకు అనుమతించాలని కోరారు. అనంతరం వైస్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు శిబిరానికి వెళ్ళారు.

కాగా మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్స్ ఉండగా కాంగ్రెస్ పార్టీలో 27 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇతర పార్టీల మద్దతుతో అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు అన్వర్ అహ్మద్, చాట్ల రాజేశ్వర్, పాత శివకృష్ణ మూర్తి, చాట్ల వంశీ, శంకర్ రావ్, కన్నయ్య, రవి, షేరు, మామిండ్ల రమేష్, ఊరుదొండ వనిత, యామిన్, జాహిరా బేగం, పైమ సుల్తానా, తేజప్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story