నిజాంసాగర్ ప్రధాన కాలువలో ముగ్గురు గల్లంతు

by Sridhar Babu |
నిజాంసాగర్ ప్రధాన కాలువలో ముగ్గురు గల్లంతు
X

దిశ, బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా వర్ని, చందూర్ మండలాల్లోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు గల్లంతయినట్లు వర్ని ఎస్ ఐ కృష్ణ కుమార్ తెలిపారు. దీంతో ఆ రెండు మండలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వర్ని మండలం లోని అఫంది ఫారం వద్ద నిజాంసాగర్ కాలువ లో స్నానం కు వెళ్లి మోచి నారాయణ(20)

అనే యువకుడు గల్లంతు కాగా ఆయన్ని కాపాడే యత్నంలో అయన పెద్ద నాన్న విజయ్(50) కూడా గల్లంతయ్యాడని ఎస్ ఐ తెలిపారు. అదే విధంగా చందూర్ మండల కేంద్రానికి సమీపంలో గల నిజాం సాగర్ ప్రధాన కాలువలో మొండి విషు వర్ధన్ (25) గల్లంతు అయినట్లు ఎస్ ఐ పేర్కొన్నారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలాలకు చేరుకొని గాలింపు చర్యలు చేపడుతున్నామని అయిన వివరించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నదని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ ఐ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed