తాండూర్ త్రిలింగరామేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే, కలెక్టర్​ ప్రత్యేక పూజలు

by Sridhar Babu |
తాండూర్ త్రిలింగరామేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే, కలెక్టర్​ ప్రత్యేక పూజలు
X

దిశ, ఎల్లారెడ్డి : మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డి పేట మండలం తాండూర్ గ్రామంలో కొలువైన త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనదని, ఆలయం అభివృద్ధికి గత పాలకులు ఎవరూ కృషి చేయలేరని అన్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆలయం అభివృద్ధికి దేవాదాయ శాఖ ద్వారా నిధులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed