ఖబర్దార్ పోచారం భాస్కర్ రెడ్డి

by Sridhar Babu |
ఖబర్దార్ పోచారం భాస్కర్ రెడ్డి
X

దిశ, కోటగిరి : ఖబర్దార్ పోచారం భాస్కర్ రెడ్డి నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ బుధవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు

డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పై వాడు వీడు అనే అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అవినీతి అక్రమాలకు నిలయంగా ఉన్న మీరు కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఉన్నతమైన హోదాలలో ఉన్న మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగాధర్ దేశాయ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్, గర్దాస్ ఆనంద్, హనుమంతు, అఫ్జల్,హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed