నేను ఓడిపోయిన.. మా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది : ప్రొద్దుటూరి వినయ్

by Kalyani |
నేను ఓడిపోయిన.. మా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది : ప్రొద్దుటూరి వినయ్
X

దిశ, ఆర్మూర్ : తను ఆర్మూర్లో ఓడిపోయిన మా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని, ఆర్మూర్ నియోజకవర్గ నలుమూలల అభివృద్ధికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి వినయ్ రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిసారిగా ఆర్మూర్ లోని ప్రెస్ క్లబ్ కి వచ్చిన వినయ్ కుమార్ రెడ్డికి ప్రెస్ క్లబ్ సభ్యులు పలు సమస్యలను వివరించారు. దీనికి వినయ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వినయ్ కుమార్ రెడ్డి ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, ఎస్.కె చిన్నారెడ్డి, కొంత మురళి, ఎస్కే బబ్లు, జిమ్మి రవి, కోల వెంకటేష్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed