- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఇంకెంత సమయం కావాలి: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
దిశ, వెబ్డెస్క్: ఇచ్చిన హామీలు నెరవేర్చచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకెంత సమయం కావాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఏమైందంటూ ప్రశ్నించారు. వారిచ్చినవి 420 హామీలంటూ ఎద్దేవా చేశారు. సీఎం ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారంటూ మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని అన్నారు.
బీఆర్ఎస్ హాయంలో ప్రజలకు ఏ లోటు రాలేదని, పార్టీ ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో ముందుండేదని అన్నారు. అదేవిధంగా ఎవరైనా కార్యక్రమాల పేరిట ఆశలు చూపినా.. ప్రజలెవరూ మోసపోవద్దని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా.. బీఆర్ఎస్ నేతలపై ప్రోటోకాల్ అతిక్రమిస్తే సీఎం వచ్చిన ఊరుకోనేది లేదాని స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని అన్నారు. అదేవిధంగా బాన్సువాడ తన తల్లిలాంటిదని, ఇక్కడకి వస్తే తల్లిగారింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. వారికి అందుబాటులో ఉంటానని తెలిపారు.