హోటల్ దగ్ధం... రూ.50 వేలు నష్టం

by Sridhar Babu |
హోటల్ దగ్ధం... రూ.50 వేలు నష్టం
X

దిశ, లింగంపేట్ : లింగంపేట మండలంలోని కన్నాపూర్ బస్టాఫ్​ వద్ద పాకలో నిర్వహిస్తున్న హోటల్​ను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారని బాధితురాలు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి లింగంపేట మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన వీరబోయిన లక్ష్మి కన్నాపూర్ గ్రామ సమీపంలో పోల్కంపేట్ ప్రధాన రహదారి పక్కన కన్నాపూర్ బస్సు స్టేజ్ వద్ద పాకను ఏర్పాటు చేసుకొని హోటల్ నిర్వహిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఉండడంతో ఉదయం

నుంచి సాయంత్రం వరకు హోటల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి హోటల్ మూసివేసి కన్నాపూర్ గ్రామానికి వెళ్లగా తెల్లారి అక్కడికి వెళ్లేసరికి హోటల్ దగ్ధమై ఉందని బాధితురాలు పేర్కొన్నారు. గుడిసెలో ఉన్న కుర్చీలు హోటల్ సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. హోటల్ దగ్ధమైన విషయంపై లింగంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కావాలనే కొందరు హోటల్ దహనం చేశారని, 15 రోజుల క్రితం తన వ్యవసాయ పొలంలో పది బస్తాల ధాన్యంను దహనం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

Next Story

Most Viewed