10వ తరగతిలో మంచి ఫలితాలు రావాలి

by Sridhar Babu |
10వ తరగతిలో మంచి ఫలితాలు రావాలి
X

దిశ, బోధన్ : ఎడపల్లి, రెంజల్ మండలాల్లోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్, సాటాపూర్ ఫార్మ్ లోని హై స్కూల్ ను తనిఖీ చేసి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. తదనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. రెంజల్ మండలం కస్తూర్భా గాంధీ, మోడల్ స్కూల్ లను హాస్టల్ లను సైతం తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, లేనియెడల శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed