- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఎక్సైజ్ కస్టడి నుంచి గంజాయి విక్రేత పరారీ
దిశ , నిజామాబాద్ క్రైం : గంజాయి విక్రయిస్తూ దొరికిన యువకుడిని ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోగా సెంట్రీ నిర్లక్ష్యంతో ఆ యువకుడు పరారీ అయ్యాడు. ఈ సంఘటన బుధవారం జరుగగా ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్ కు చెందిన
అంజద్ అనే యువకుడు గంజాయి విక్రయిస్తున్నాడని ఎక్సైజ్ పోలీసులు బుధవారం వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కస్టడిలోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే అక్కడ సెంట్రీ విధులు నిర్వహిస్తున్న దాస్ అనే కానిస్టేబుల్ నిర్లక్ష్యంతో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎక్సైజ్ పోలీసుల కస్టడి నుంచి గంజాయి విక్రేత పరారీ కావడంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.